గదిలో ఎవరూ లేనప్పుడు.. ఆ ఆంటీ ఒక మైనర్‌తో ఏం చేసేదంటే..

ABN , First Publish Date - 2021-10-08T11:36:44+05:30 IST

హైదరాబాద్‌లోని ఒక స్కూల్‌లో కేర్‌టేకర్‌గా పనిచేసే సరోజ(పేరు మార్చబడినది) ఒక పసివాడిపై చేసిన దారుణాలని విన్న కోర్టు న్యాయమూర్తి అవాక్కయ్యారు. మహిళలు ఇలా కూడా చేస్తారా అని. సరోజ చేసిన పనికి కోర్టు ఆమెకు పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది

గదిలో ఎవరూ లేనప్పుడు.. ఆ ఆంటీ ఒక మైనర్‌తో ఏం చేసేదంటే..

హైదరాబాద్‌లోని ఒక స్కూల్‌లో కేర్‌టేకర్‌గా పనిచేసే సరోజ(పేరు మార్చబడినది) ఒక పసివాడిపై చేసిన దారుణాలని విన్న కోర్టు న్యాయమూర్తి అవాక్కయ్యారు. మహిళలు ఇలా కూడా చేస్తారా అని. సరోజ చేసిన పనికి కోర్టు ఆమెకు పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అసలేం జరిగిందంటే..


2017లో గోపి(పేరు మార్చబడినది)అనే 9 ఏళ్ల బాలుడిని ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ లభించింది. అదే స్కూల్‌లో పిల్లల కేర్‌టేకర్‌గా పనిచేసే సరోజ(27) ఆ పసివాడి మర్మాంగాలని తాకేది, అతడిని బెదిరించి లైంగికంగా వేధించేది. ఒకరోజు గోపి తండ్రి.. పిల్లాడి ఒంటిపై కాల్చిన గాయాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇదెలా జరిగిందని గోపిని అడిగాడు. అప్పుడు ఆ పసివాడు చెప్పడానికి తడబడ్డాడు. తండ్రి ప్రేమగా దెగ్గరకు తీసుకొని అడగటంతో నిజం బయటపెట్టాడు.


స్కూల్‌లో సరోజ టీచర్ తనను తరుచూ గట్టిగా పట్టుకునేదని, ఎవరూ లేని చోట తీసుకొని వెళ్లి తన మర్మాంగాలని నొక్కేదని, దాని వల్ల ఎంతో నొప్పి కలగేదని.. అందరికీ ఈ విషయం చెప్పేస్తాననడంతో సిగరెట్‌తో తన ఒంటిపై కాల్చి ఎవరికైనా విషయం చెబితే తన ఒంటి నిండా ఇలాగే సిగరెట్‌తో కాలుస్తానని బెదిరించదని, గోపి చెప్పాడు.


విషయం తెలుసుకున్న గోపి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత పోలీసులు సరోజను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించి, 10 వేల రూపాయల కూడా కట్టాలని తీర్పునిచ్చింది.

Updated Date - 2021-10-08T11:36:44+05:30 IST