Accident: పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-08-18T15:34:56+05:30 IST

ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. సేలం జిల్లా లత్తువాడి గ్రామా

Accident: పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 17: ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. సేలం జిల్లా లత్తువాడి గ్రామానికి చెందిన కాశి-సుధ దంపతులకు వేదాశ్రీ, భవానిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. బుధవారం ఉదయం తన పెద్దకుమార్తె నాలుగేళ్ల వేదాశ్రీ(Vedashree)ని ప్రైవేటు పాఠశాలకు పంపేందుకు సుధ తన ఏడాదిన్నర కుమార్తె భవానికతో రోడ్డు పక్కన నిల్చుంది. కుమార్తెను పాఠశాల బస్సు ఎక్కించిన తరుణంలో చిన్న కుమార్తె పక్కన లేకపోవడం సుధ గుర్తించింది. అదే సమయంలో బస్సు ముందు చక్రం కింద పడి కుమార్తె మృతిచెంది పడి ఉండడం గమనించి బోరున విలపించింది. ఈ ఘటనపై వీరగనూరు పోలీసులు కేసు నమోదుచేసి, బస్సు డ్రైవర్‌ సుధాకర్‌ను అరెస్టు చేశారు.


Updated Date - 2022-08-18T15:34:56+05:30 IST