మా పాఠశాల మాక్కావాలి

ABN , First Publish Date - 2022-07-08T00:35:46+05:30 IST

నాడు నేడులో రూ. 17 లక్షల ఖర్చులో తీర్చిదిద్దిన పాఠశాలలోనే తమ పిల్లలను ఉంచాలని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు ప్రాథమిక పాఠశాలలో

మా పాఠశాల మాక్కావాలి

గుడ్లవల్లేరు: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను.. ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాపాఠశాలల్లో విలీనం చేస్తూ రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాడు నేడులో రూ. 17 లక్షల ఖర్చులో తీర్చిదిద్దిన పాఠశాలలోనే తమ పిల్లలను ఉంచాలని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జీవో నెంబర్‌ 117ను వెంటనే రద్దు చేయాలని, ఎలిమెంట్రీ పాఠశాలలను హైస్కూళ్ళలో విలీనం చేసిన విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2022-07-08T00:35:46+05:30 IST