కస్తూర్బా పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-12-06T04:45:48+05:30 IST
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో త్వరలోనే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాలను ఏర్పాటు చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఛీప్ కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు అన్నారు.
పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ చినవీరభద్రుడు
తాడికొండ డిసెంబరు 5: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో త్వరలోనే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాలను ఏర్పాటు చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఛీప్ కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు అన్నారు. శనివారం తాడికొండలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రిజనల్ ట్రైనింగ్ సెంటర్ను, గురుకుల పాఠశాలను పరిశీలించారు. అక్కడ మొక్కలను నాటారు. కార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రవీంద్రనాఽథ్రెడ్డి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి వేణుధర్, ఎస్వోసీ పి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.