పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి

ABN , First Publish Date - 2022-08-10T05:25:35+05:30 IST

ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు.

పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి

పీఆర్‌టీయూ జిల్లా అధ ్యక్షుడు వెంకటేశ్వర రావు

పాల్వంచ, ఆగస్టు 9: ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం జిల్లా కార్యనిర్వహకవర్గ సమావేశాన్ని పాల్వంచలోని జడ్పీ పాఠశాలలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌ లోన్‌లు, సరెండర్‌ లీవ్‌లు,జీతాలు విడుదల చేయాలని అన్నారు.  సమావేశంలో రాష్ట్ర బాధ్యులు వెంకటేశ్వరరెడ్డి, సాయిబాబా, వెంకటేశ్వరరావు, దశం బాబు, భవాని శేఖర్‌, దేవా సింగ్‌, జిల్లా బాధ్యులు నర్సయ్య, జయ నిర్మల, దుర్గా రాణి, హరి, మండల బాధ్యులు సంగమేశ్వరరావు, కిరణ్‌, కిషన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:25:35+05:30 IST