ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారు: లోకేష్‌

ABN , First Publish Date - 2022-03-11T21:14:26+05:30 IST

వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారని టీడీపీ నేత లోకేష్‌ తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారు: లోకేష్‌

అమరావతి: వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారని టీడీపీ నేత లోకేష్‌ తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని దుయ్యబట్టారు. బీసీల ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం కోతలు పెడుతోందని ధ్వజమెత్తారు. హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారని విమర్శించారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి రూ.1,850 పెన్షన్ ఇస్తే.. తండ్రి, కొడుకులు కలిసి ఇచ్చింది రూ.625 మాత్రమేనని తెలిపారు. అన్ని వర్గాలను జగన్‌రెడ్డి మోసం చేశారని లోకేష్‌ ఆరోపించారు.

Updated Date - 2022-03-11T21:14:26+05:30 IST