రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని సన్మానించిన ఆర్కే పురం కార్పొరేటర్

ABN , First Publish Date - 2020-10-14T00:05:24+05:30 IST

రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కొప్పు భాషాను ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి సన్మానించారు.

రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని సన్మానించిన ఆర్కే పురం కార్పొరేటర్

హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కొప్పు భాషాను ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి సన్మానించారు. ఆర్కే పురం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ధీరజ్ రెడ్డి, జిల్లా నాయకులు ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముంత రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడతానని, ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా భాషా తెలిపారు. 

Updated Date - 2020-10-14T00:05:24+05:30 IST