దళిత బంధు కాదు... దళిత సీఎం కావాలి
ABN , First Publish Date - 2021-08-02T05:20:37+05:30 IST
దళిత బంధు కాదు తెలంగాణ రాష్ట్రానికి దళిత సీఎం కావాలని మాలమహానాడు నాయకులు పేర్కొన్నారు.
కృష్ణానగర్ ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు కాదు తెలంగాణ రాష్ట్రానికి దళిత సీఎం కావాలని మాలమహానాడు నాయకులు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ మాలమహానాడు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్, రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలుపుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ దళిత ద్రోహి పార్టీలేనన్నారు. త్వరలో హుజూరాబాద్లో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బందెల రాజభద్రయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు యాదలక్ష్మి, ఉద్యోగ విభాగం అధ్యక్షుడు మోహన్రావు, ప్రధాన కార్యదర్శి సబ్బాని రాజనర్సు, ఉపాధ్యక్షులు ప్రభాకర్, గంగారాం, బ్యాగరీ మన్నెం, నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.