ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఉద్యమం
ABN , First Publish Date - 2022-08-08T02:49:05+05:30 IST
ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోందని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు.
కావలి, ఆగస్టు 7: ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోందని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ నిరంకుశ పాలనకు నిరసనగా కావలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 7వ రోజుకు చేరింది. ఈ దీక్షలో కావలి రూరల్ మండలం కొత్తపల్లి ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో అక్కిలగుంట ఏసురత్నం మాదిగ, కిరణ్మాదిగ, ప్రేమకుమార్, ఆర్. ఎర్రయ్య, వై. శివ, బీ. సురేంద్ర, పీ. సంతోష్, ఆర్ దయాకర్, బీ. కల్యాణ్, మనోహర్, జానకి, సుశీల తదితరులు పాల్గొన్నారు.