ఏటీఎం సెంటర్ వద్ద వృద్ధుడిని బురిడీ కొట్టించిన యువకుడు

ABN , First Publish Date - 2021-07-25T01:21:13+05:30 IST

ఏటీఎం సెంటర్ వద్ద వృద్ధుడిని బురిడీ కొట్టించిన యువకుడు

ఏటీఎం సెంటర్ వద్ద వృద్ధుడిని బురిడీ కొట్టించిన యువకుడు

గుంటూరు: నగరంలో ఏటీఎం సెంటర్ వద్ద యువకుడు వృద్ధుడిని బురిడీ కొట్టించాడు. డబ్బులు డ్రా చేస్తానని పాండురంగ పేటకు చెందిన చిట్టినేని సాంబశివరావు అనే 85 ఏళ్ల వృద్ధుడిని యువకుడు మోసం చేశాడు. కార్డు పనిచేయడం లేదంటూ వృద్ధుడికి నకిలీ కార్డు ఇచ్చి అసలు కార్డుతో రూ.16500 డ్రా చేసుకుని పరారైయ్యాడు. తెనాలి చెంచుపేటలోని ఎస్బీఐ ఏటిఎం వద్ద ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-07-25T01:21:13+05:30 IST