బ్యాంకులో చోరీకి ప్లాన్..అడ్డంగా బుక్కయ్యారు..
ABN , First Publish Date - 2021-08-01T18:37:26+05:30 IST
చెడు అలవాట్లకు బానిసైన ముగ్గురు.. డబ్బు సంపాదించాలని బ్యాంక్కే కన్నం పెట్టాలని చూసి..
విశాఖ: చెడు అలవాట్లకు బానిసైన ముగ్గురు.. డబ్బు సంపాదించాలని బ్యాంక్కే కన్నం పెట్టాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు. విశాఖకు చెందిన జగదీష్, సాయి కిరణ్, మరో మైనర్ కలిసి కంచరపాలెంలో ఎస్బీఐలో కన్నం వేసేందుకు రెక్కి చేశారు. బ్యాంకు కిటికీ నుంచి లోపలికి ప్రవేశించి లాకర్లోని బంగారం, డబ్బు కాజేద్దామనుకున్నారు. సీసీ కెమెరాలు, అలారం ఆఫ్ చేసి దొంగ తెలివి ప్రదర్శించారు. అయితే దొంగతనం చేయలేకపోయారు. మరుసటి రోజు బ్యాంక్ సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ బయటపడింది.
డబ్బు సంపాదించాలనే కోరికతో బ్యాంక్కు కన్నం వేసేందుకు కంచరపాలెంకు చెందిన సాయికిరణ్ పథకం వేసినట్లు విచారణలో తేలింది. అతనికి జగదీష్, మరో స్నేహితుడు సహకరించారని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. కిటికీ గ్రిల్స్ తొలగించేందుకు ఇనుపరాడ్ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.