గిరిజన ప్రాంతంలో హిందూ ధరాన్ని పరిరక్షించాలి
ABN , First Publish Date - 2021-04-13T05:34:31+05:30 IST
గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుందని హైదరాబాద్కి చెందిన సద్గురు రావడి యోగేంద్ర స్వామి అన్నారు.
సద్గురు రావడి యోగేంద్ర స్వామి
చింతపల్లి, ఏప్రిల్ 12: గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుందని హైదరాబాద్కి చెందిన సద్గురు రావడి యోగేంద్ర స్వామి అన్నారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న 73వ వేదాంత తత్వప్రబోధ సభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలు హిందూ ధర్మాన్ని విస్మరించకూడదని, దేవతలు, దేవాలయాల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. జర్రెల సద్గురు బుక్క రాజనందస్వామి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుంచే హిందూ ధర్మాన్ని బోధించాలని, వారిలో భక్తిభావాన్ని నింపాలన్నారు. పండగలు, ఆచారాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.