ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల బ్యాన్.. పౌరులకు సౌదీ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-28T05:42:25+05:30 IST

ఎడారి దేశం సౌదీ అరేబియా తన దేశ పౌరులకు కఠిన హెచ్చరిక చేసింది. తాము విడుదల చేసిన ‘రెడ్ లిస్టు’లో ఉన్న దేశాలకు కనుక వెళ్తే వారిని సౌదీలో

ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల బ్యాన్.. పౌరులకు సౌదీ హెచ్చరిక

రియాద్: ఎడారి దేశం సౌదీ అరేబియా తన దేశ పౌరులకు కఠిన హెచ్చరిక చేసింది. భారత్ సహా తాము విడుదల చేసిన ‘రెడ్ లిస్టు’లో ఉన్న దేశాలకు కనుక వెళ్తే వారిని సౌదీలోకి రాకుండా మూడేళ్ల పాటు బ్యాన్ విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సౌదీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. సౌదీ ‘రెడ్ లిస్ట్’లో భారత్ సహా అఫ్ఘానిస్తాన్, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ, ఈజిప్టు తదితర దేశాలు ఉన్నాయి.

Updated Date - 2021-07-28T05:42:25+05:30 IST