సౌదీలో 2.50 ల‌క్ష‌ల మార్కును దాటిన‌ రిక‌వ‌రీలు !

ABN , First Publish Date - 2020-08-09T18:13:41+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నుంచి సౌదీ అరేబియా క్ర‌మంగా కోలుకుంటోంది.

సౌదీలో 2.50 ల‌క్ష‌ల మార్కును దాటిన‌ రిక‌వ‌రీలు !

రియాద్: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నుంచి సౌదీ అరేబియా క్ర‌మంగా కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు అంత‌కంత‌కు రిక‌వ‌రీలు పెరుగుతున్నాయి. తాజాగా రివ‌క‌రీలు 2.50 ల‌క్ష‌ల మార్కును దాటాయి. శ‌నివారం సౌదీలో 1,469 కొత్త కేసులు న‌మోదు కాగా... 1,469 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారు 250,440 అయ్యారు. అలాగే పాజిటివ్ కేసులు 2,87,262కు చేరాయి. నిన్న 37 కొత్త మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్‌కు బ‌లైన వారి సంఖ్య 3,130కు చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 33,692 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే... వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విరుచుకుప‌డుతున్న కోవిడ్ ఇప్ప‌టికే 7.29 ల‌క్ష‌ల మందిని క‌బ‌ళించింది. కోటి 98 లక్ష‌ల మంది బాధ‌తులు ఉన్నారు.    ‌  

Updated Date - 2020-08-09T18:13:41+05:30 IST