హజ్ యాత్రికుల విషయంలో సౌదీ కీలక నిర్ణయం !

ABN , First Publish Date - 2021-03-04T20:09:24+05:30 IST

హజ్ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

హజ్ యాత్రికుల విషయంలో సౌదీ కీలక నిర్ణయం !

రియాధ్: హజ్ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే వారికి కొవిడ్-19 టీకా తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈసారి యాత్రకు అవకాశం ఇస్తామని సౌదీ స్పష్టం చేసింది. ఈ మేరకు సౌదీ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. "ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఉంటుంది. హజ్ యాత్రికులకు ఈసారి ఇదే ప్రధాన కండిషన్ కూడా." అని హెల్త్ మినిస్ట్రీ తన ప్రకటనలో పేర్కొంది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తవ్ఫిక్ అల్ రబియా సంతకం చేసిన ఈ సర్క్యూలర్‌ను సంబంధిత అధికారులు మీడియాకు అందించారు. అయితే, ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ ఎంతమంది యాత్రికులను అనుమతి ఇవ్వనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక గతేడాది కరోనా కారణంగా విదేశీ యాత్రికులను నిషేధించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-03-04T20:09:24+05:30 IST