కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం: సత్యవతి రాథోడ్‌

ABN , First Publish Date - 2022-04-08T22:45:53+05:30 IST

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు

కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం: సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు మహిళలంటే గౌరవమని, మర్యాదగా చూసుకునే సంస్కృతి తమదని తెలిపారు. ప్రోరోగ్ కాలేదు కాబట్టే బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నామని చెప్పారు. గవర్నర్ ఢిల్లీకి వెళ్లి మాట్లాడిన మాటలను చూస్తుంటే.. గవర్నర్ మనసులో ఏం ఉందో అర్థమవుతోందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించినట్లు మాట్లాడారని తప్పుబట్టారు. గవర్నర్‌ బీజేపీ కార్యకర్తలా మాట్లాడారని సత్యవతి రాథోడ్‌ దుయ్యబట్టారు.

Updated Date - 2022-04-08T22:45:53+05:30 IST