డీఈవోగా సత్యసుధ
ABN , First Publish Date - 2021-09-19T05:10:16+05:30 IST
జిల్లా విద్యా శాఖ అధికారిగా ఎన్.సత్యసుఽధను నియమిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీఈవోగా పనిచేసిన జి.నాగమణికి పదోన్నతి రావడంతో ఆమె అమరావతి వెళ్లిన సంగతి తెలిసిందే.
కలెక్టరేట్, సెప్టెంబరు 18 : జిల్లా విద్యా శాఖ అధికారిగా ఎన్.సత్యసుఽధను నియమిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీఈవోగా పనిచేసిన జి.నాగమణికి పదోన్నతి రావడంతో ఆమె అమరావతి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇన్చార్జి డీఈవో బాధ్యతలను ఏడీ లక్ష్మణరావుకు అప్పగించారు. ఆర్జేడీ (అమరావతి) కార్యాలయంలో ఏడీగా పనిచేసున్న సత్యసుధకు పదోన్నతి కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమించారు. ఆమె ఈనెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు.