శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో వైసీపీ నేతల వీరంగం

ABN , First Publish Date - 2022-07-07T03:48:20+05:30 IST

సోమందేపల్లి మండలం గుడిపల్లిలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర నారాయణకు వ్యతిరేకంగా..

శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో వైసీపీ నేతల వీరంగం

శ్రీ సత్యసాయి (Satyasai): సోమందేపల్లి మండలం గుడిపల్లిలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర నారాయణ (Mla Sankar Narayana)కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త కళ్యాణ్ (Kalyan) ఇంటి‌పై మూకుమ్మడి దాడి చేశారు. ఇంటికి కరెంట్ సరఫరా కట్ చేసి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. అడ్డు వచ్చిన మహిళలపైనా విచక్షణా రహితంగా దాడి చేశారు. సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర నారాయణ సోదరుడు మల్లికార్జున అనుచరులని బాధితులు చెబుతున్నారు. 



Updated Date - 2022-07-07T03:48:20+05:30 IST