సత్యసాయి కళాశాలలో మరో 42 మందికి Covid
ABN , First Publish Date - 2022-05-08T15:45:00+05:30 IST
చెంగల్పట్టు జిల్లా అమ్మాపేటలోని సత్యసాయి ప్రైవేటు మెడికల్ కళాశాలలో మరో 42 మం దికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించిన
పెరంబూర్(చెన్నై): చెంగల్పట్టు జిల్లా అమ్మాపేటలోని సత్యసాయి ప్రైవేటు మెడికల్ కళాశాలలో మరో 42 మం దికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో, శుక్రవారం 30 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయిం ది. దీంతో కళాశాలలో ఉంటున్న మరో 927 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కళాశాలను శనివారం ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్ పరిశీలించి, కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆరోగ్యశాఖ అధికారులు, కళాశాల నిర్వాహకులకు పలు సూచనలిచ్చారు.