జడ్పీ ఇన్చార్జి సీఈవోగా సత్యనారాయణ
ABN , First Publish Date - 2022-08-14T06:11:36+05:30 IST
జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా డి.సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించడంతో విజయనగరం రూరల్ ఎంపీడీవోగా ఉన్న సత్యనారాయణను జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీచేశారు.
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా డి.సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించడంతో విజయనగరం రూరల్ ఎంపీడీవోగా ఉన్న సత్యనారాయణను జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీచేశారు. అయితే ఇక్కడ సీఈవో పోస్టు ఖాళీగా ఉండడంతో అదనపు బాధ్యతలు అప్పగించారు. చైర్పర్సన్ సుభద్రను మర్యాద పూర్వకంగా కలిసిన సత్యనారాయణ సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ అధికారులు, ఉద్యోగులు ఆయనను అభినందించారు. అనంతరం జడ్పీ స్థాయీ సంఘ సమావేశానికి హాజరయ్యారు.