వీడని సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ..

ABN , First Publish Date - 2022-06-27T18:01:52+05:30 IST

వికారాబాద్ జిల్లా తాండూరుకి చెందిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు.

వీడని సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ..

Vikarabad : వికారాబాద్ జిల్లా తాండూరుకి చెందిన బీఎస్పీ(BSP) జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. వికారాబాద్ నుంచి శంషాబాద్(Shamshabad) వచ్చి, అక్కడ నుంచి ముంబై(Mumbai) వెళ్లినట్లు గుర్తించారు. సత్యమూర్తితో పాటు ఇద్దరు కూతుళ్లను ముంబైకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. మూడు నెలలు క్రితం సత్యమూర్తి భార్య అన్నపూర్ణ ఇంటి నుంచి లేఖ రాసి వెళ్లి పోయింది. అప్పటి నుంచి ఇంకా అన్నపూర్ణ ఆచూకీ లభించక పోవడంతో సత్యమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ చెప్పాలని పోలీసులకు డెడ్ లైన్ విధించాడు. నేటితో 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. మరోవైపు అన్నపూర్ణ దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సత్యమూర్తి, ఇద్దరు కూతుళ్లు కోసం ముంబై, కాశీలో పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-06-27T18:01:52+05:30 IST