సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సత్యంబాబు లేఖ
ABN , First Publish Date - 2021-11-21T03:58:55+05:30 IST
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సత్యంబాబు లేఖ రాశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై..
అమరావతి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సత్యంబాబు లేఖ రాశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు లేఖ రాశారు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో చేయనినేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి నాలుగేళ్లైనా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఆయేషా మీరా కేసును సీబీఐ ఇంకా విచారిస్తోందని, ఎప్పుడు విచారణ ముగిస్తుందో తెలియదని తెలిపారు. ఆయేషా మీరా తల్లికి, తనకు న్యాయం చేయాలని సీజేఐకి సత్యంబాబు విజ్ఞప్తి చేశారు.