శాంతియుత సత్యాగ్రహ నిరసన
ABN , First Publish Date - 2022-06-28T05:02:56+05:30 IST
స్థానిక రాజీవ్ భవన్ (కాంగ్రెస్ పార్టీ) కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి వి. నాగరాజు నాయకత్వంలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని శాంతియుత సత్యాగ్రహ నిరసన తెలిపారు.
ఆత్మకూరు, జూన్ 27: స్థానిక రాజీవ్ భవన్ (కాంగ్రెస్ పార్టీ) కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి వి. నాగరాజు నాయకత్వంలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని శాంతియుత సత్యాగ్రహ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం వల్ల దేశ రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుందన్నారు. నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయాలని అగ్నిపథ్ పథకం తీసుకొచ్చారన్నారు. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పి. మస్తానయ్య, ఎస్డీ రసూల్, ఎ. పెంచలయ్య, ఎస్. పెంచలమ్మ, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.