శాంతియుత సత్యాగ్రహ నిరసన

ABN , First Publish Date - 2022-06-28T05:02:56+05:30 IST

స్థానిక రాజీవ్‌ భవన్‌ (కాంగ్రెస్‌ పార్టీ) కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి వి. నాగరాజు నాయకత్వంలో అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని శాంతియుత సత్యాగ్రహ నిరసన తెలిపారు.

శాంతియుత సత్యాగ్రహ నిరసన
శాంతియుత సత్యాగ్రహ నిరసన తెలుపుతున్న యువజన కాంగ్రెస్‌ నాయకులు

ఆత్మకూరు, జూన్‌ 27:  స్థానిక రాజీవ్‌ భవన్‌ (కాంగ్రెస్‌ పార్టీ) కార్యాలయంలో  జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి వి. నాగరాజు నాయకత్వంలో అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని శాంతియుత సత్యాగ్రహ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకం వల్ల దేశ రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుందన్నారు. నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయాలని అగ్నిపథ్‌ పథకం తీసుకొచ్చారన్నారు. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పి. మస్తానయ్య, ఎస్‌డీ రసూల్‌, ఎ. పెంచలయ్య, ఎస్‌. పెంచలమ్మ, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:02:56+05:30 IST