అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ABN , First Publish Date - 2022-05-18T06:30:28+05:30 IST

నేపాల్‌, శ్రీలంక భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరింపజేశాయి. బుద్ధపూర్ణిమ వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పుట్టపర్తి, మే 17: నేపాల్‌, శ్రీలంక భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరింపజేశాయి. బుద్ధపూర్ణిమ వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. స్థానిక సాయికుల్వంతు మందిరంలో శ్రీలంక భక్తులు కండియన పేరిట శ్రీలంక సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. డోల్‌ వాయి ద్యం, నృత్యంతో భక్తులను మైమరపింపజేశారు. నేపాల్‌ బాలవికాస్‌ విద్యార్థినులు సంగీత నృత్యంతో అలరింపజేశారు. అనంతరం విదేశీభక్తులకు ట్రస్టువర్గాలు వస్ర్తాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, నమీ్‌షపాండే  పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T06:30:28+05:30 IST