టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా సత్య

ABN , First Publish Date - 2021-10-16T05:30:00+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఆ పార్టీ యువనాయకుడు దామచర్ల సత్యనారాయణ (సత్య) నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీని విస్తరించి మరికొంత మందికి స్థానం కల్పిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రకటించారు. అందులో జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. వీరిలో సత్యతోపాటు, రాష్ట్ర కార్యదర్శిగా పర్చూరు నియోజకవర్గానికి చెందిన దేవతోటి నాగరాజు నియమితులయ్యారు.

టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా సత్య
దామచర్ల సత్యనారాయణ

పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి కొత్తగా ఇద్దరికి చోటు

ఒంగోలు, అక్టోబరు 16  (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఆ పార్టీ యువనాయకుడు దామచర్ల సత్యనారాయణ (సత్య) నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీని విస్తరించి మరికొంత మందికి స్థానం కల్పిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రకటించారు. అందులో జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. వీరిలో సత్యతోపాటు, రాష్ట్ర కార్యదర్శిగా పర్చూరు నియోజకవర్గానికి చెందిన దేవతోటి నాగరాజు నియమితులయ్యారు. సత్య జిల్లాలో టీడీపీ యువనేతగా గుర్తింపు పొందారు. పార్టీ కొండపి నియోజకవర్గ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సత్యను ప్రోత్సహించేంచేందుకు ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా నియమించారు. ఆయన్ను కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, పలువురు నేతలు అభినందించారు. 



Updated Date - 2021-10-16T05:30:00+05:30 IST