పోరాడి ఓడిన సాత్విక్ జోడీ
ABN , First Publish Date - 2021-01-24T10:24:15+05:30 IST
థాయ్లాండ్ ఓపెన్లో సాత్విక్ జోడీల పోరాటం సెమీ్సతో ముగిసింది.
డబుల్స్, మిక్స్డ్లో ఓటమి
మహిళల ఫైనల్లో మారిన్
డబుల్స్, మిక్స్డ్లో ఓటమి
మహిళల ఫైనల్లో మారిన్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్లో సాత్విక్ జోడీల పోరాటం సెమీ్సతో ముగిసింది. పురుషులు డబుల్స్, మిక్స్డ్లో సాత్విక్ జంటలు ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాయి. శనివారం జరిగినమిక్స్డ్ డబుల్స్ సెమీ్సలో సాత్విక్-అశ్వినీ పొన్నప్ప జోడీ 20-22, 21-18, 12-21తో థాయ్లాండ్కు చెందిన డెచపోల్-సా్పశిరి ద్వయం చేతిలో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట 18-21, 18-21తో మలేసియాకు చెందిన ఆరోన్ చియా-సూ వుయ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్లో 15-16 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన మలేసియా జంట గేమ్ పాయింట్పై నిలిచింది.
భారత జోడీ కొంత ప్రతిఘటించినా 18-21తో గేమ్ను చేజార్చుకొంది. ఇక రెండో గేమ్లో ఒక దశలో స్కోర్లు 8-8తో సమమైనా పదునైన స్మాష్లతో విరుచుకుపడ్డ మలేసియా జోడీ గేమ్తోపాటు మ్యాచ్నూ సొంతం చేసుకొంది. కాగా, మహిళల సింగిల్స్లో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీ్సలో మారిన్ 21-19, 21-15తో అన్ సి యంగ్ (కొరియా)పై నెగ్గింది. తుది పోరులో చైనీస్ తైపీ స్టార్ తై జు యింగ్తో తలపడనుంది.