ఉత్తరప్రదేశ్: వీకెండ్ లాక్డౌన్లో శనివారం సడలింపు!
ABN , First Publish Date - 2021-08-14T16:17:52+05:30 IST
కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన...
లక్నో: కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన వీకెండ్ లాక్డౌన్లో సడలింపులిచ్చింది. ఇకపై శనివారం లాక్డౌన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మిగిలిన రోజుల మాదిరిగానే శనివారం అన్ని వ్యాపార కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అయితే ఆదివారం లౌక్డౌన్ యధావిధిగా అమలవుతుంది. యూపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
రోజుకు పదుల సంఖ్యలో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. దీనిని గమనించిన ప్రభుత్వం లాక్డౌన్ను కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితం చేసింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకూ రాష్ట్రంలో అన్ని వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయి. కొత్తగా ఇచ్చిన సడలిపుల ప్రకారం శనివారం కూడా వ్యాపార కార్యకలాపాలు కొనసాగనున్నాయి.