సతులు గ్రామాల్లో.. పతులు మండలమీట్‌లో

ABN , First Publish Date - 2022-09-29T05:51:10+05:30 IST

ఎంపీపీ మహ మూద్‌ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావే శానికి ప్రజా ప్రతినిదులు హాజరు కావాల్సి ఉండగా వారికి బదులు వారి భర్తలు, వారసులు హాజరై ఉన్న వివిధ శాఖల అధికారులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.

సతులు గ్రామాల్లో.. పతులు మండలమీట్‌లో
మండల మీట్‌లో అధికారులను ప్రశ్నిస్తున్న మద్దయ్యగారిపల్లె ఎంపీటీసీ కుమారుడు

పెద్దతిప్పసముద్రం సెప్టెం బరు 28 : ఎంపీపీ మహ మూద్‌ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావే శానికి  ప్రజా ప్రతినిదులు హాజరు కావాల్సి ఉండగా  వారికి బదులు వారి భర్తలు, వారసులు హాజరై ఉన్న వివిధ శాఖల అధికారులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు ప్రోటోకాల్‌ పాటించక పోవడంతో మండలంలోని వైసీపీ కార్యకర్తలందరు సమావేశ మందిరంలో కూర్చొండిపోయారు. జిల్లా రైతు సంఘం సభ్యునికి ఎలాం టి ఆహ్వానం లేక పోయినా వేదికపై కూర్చొని అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించడం ప్రజాప్రతినిధులకే మింగుడు పడలేదు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది ప్రజ లకు సరైన వైద్యం అందించడం లేదంటూ ఓ ప్రజాప్రతినిధి వైద్య అధికారులను నిలదీశారు. మండలంలోని రైతులకు ట్రాన్స్‌పార్మర్ల కోసం త్వరలోనే ట్రాన్స్‌పార్మర్ల మేళా నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఏఈ రామలక్ష్మయ్య సమావేశంలో తెలియచేశారు.  సమావేశంలో జడ్పీటీసీ శివన్న, తహసీల్దార్‌ విద్యా సాగర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T05:51:10+05:30 IST