జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా
ABN , First Publish Date - 2021-10-17T05:42:02+05:30 IST
జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. అనేక మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈనెల 3న పరీక్ష జరిగింది. జిల్లాకేంద్రంలోని అయాన్ డిజిటల్, లెండి, ఎంవీజీఆర్ కేంద్రాల్లోనూ పరీక్ష జరిగింది. మొయిన్స్ పరీక్షలు మూడు ధపాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు
కలెక్టరేట్, అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. అనేక మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈనెల 3న పరీక్ష జరిగింది. జిల్లాకేంద్రంలోని అయాన్ డిజిటల్, లెండి, ఎంవీజీఆర్ కేంద్రాల్లోనూ పరీక్ష జరిగింది. మొయిన్స్ పరీక్షలు మూడు ధపాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రణయ్కు 56వ ర్యాంకు
జిల్లా కేంద్రంలోని పైడిమాంబ కాలనీకి చెందిన మిడతాన ప్రణయ్కు జేఈఈ అడ్వాన్సడ్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరిలో 56వ ర్యాంకు వచ్చింది. ఓబీసీలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. జేఈఈ మొయిన్స్లో 65వ ర్యాంకు, ఏపీ ఎంసెట్లో 7వ ర్యాంకు ,తెలంగాణ ఎంసెట్లో 7వ ర్యాంకు సాధించాడు. కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సును ఐఐటీ ముంబయిలో చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రణయ్ చెప్పాడు. తండ్రి మిడతాన రామారావు గంట్యాడ మండలం లక్కిడాం జడ్పీ పాఠశాలలోనూ, తల్లి జ్యోతి రామవరం జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేస్తున్నారు.
ప్రణీత్కు 73వ ర్యాంకు
జిల్లా కేంద్రానికే చెందిన కె.ప్రణీత్ జేఈఈ అడ్వాన్సడ్ ఫలితాల్లో 73వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి కె.రాజకుమార్ నెల్లిమర్ల ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. తల్లి పీవీ రాణి కొండవెలగాడ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా విఽధులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఇంజినీరు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రణీత్ చెప్పాడు.
ఆకాంక్షకు 274వ ర్యాంకు
జిల్లా కేంద్రంలోని తూర్పుబలిజివీధికి చెందిన కనకల డిట్టూ ఆకాంక్షకు ఓపెన్లో 274, ఓబీసీ కేటగిరిలో 28వ ర్యాంకు వచ్చింది. ఆయన తండ్రి కనకల శేషుబాబు ఓ ప్రైవేటు కాలేజీకి జోనల్ ప్రిన్సిపాల్గా, తల్లి దుర్గాభవాని ఆర్అండ్బీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. తాను ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆకాంక్ష చెప్పారు.