సీఎం కేసిఆర్‌ను క‌లిసి ఆశిస్సులు తీసుకున్న‌ రెడ్ కో చైర్మ‌న్‌ Satish reddy

ABN , First Publish Date - 2022-06-22T21:18:07+05:30 IST

తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్‌) చైర్మ‌న్ గా నియ‌మితులైన యెరువు స‌తీశ్ రెడ్డి(satish reddy) ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో బుధ‌వారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు(kcr)ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

సీఎం కేసిఆర్‌ను క‌లిసి ఆశిస్సులు తీసుకున్న‌ రెడ్ కో చైర్మ‌న్‌ Satish reddy

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్‌) చైర్మ‌న్ గా నియ‌మితులైన యెరువు స‌తీశ్ రెడ్డి(satish reddy) ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో బుధ‌వారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు(kcr)ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం ఆశిస్సుల‌ను తీసుకున్నారు. త‌న‌కు ప‌ద‌వి అప్ప‌గించినందుకు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను త్రిక‌ర‌ణ శుద్ధితో నిర్వ‌ర్తిస్తాన‌ని తెలిపారు. 


అనంత‌రం స‌తీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేష‌న్ చైర్మ‌న్ వాసుదేవ రెడ్డిల‌తో క‌లిసి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని మంత్రుల నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. త‌న‌కు ఈ ప‌ద‌వి రావ‌డానికి స‌హ‌క‌రించినందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌తీశ్ రెడ్డిని స‌త్క‌రించారు.

Updated Date - 2022-06-22T21:18:07+05:30 IST