ఇండియా ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సతీష్
ABN , First Publish Date - 2020-07-12T09:55:26+05:30 IST
ఇండియా ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నస్పూర్ కు చెందిన కాశీ సతీష్కుమార్ను నియమిస్తూ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి
నస్పూర్. జూలై 11 : ఇండియా ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నస్పూర్ కు చెందిన కాశీ సతీష్కుమార్ను నియమిస్తూ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రంజిత్ ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెండోసారి సతీష్ను ఎన్నుకున్నారు. నమ్మకంతో తనకు రెండోసారి అవకాశం ఇచ్చినందున పార్టీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పెర్కొన్నారు.
పేదలకు సంక్షేమం కోసమే పోరాటాలు
మంచిర్యాల కలెక్టరేట్: నిరుపేదల సంక్షేమం, మెరుగైన విద్య, వైద్యం అందించడమే తమ పార్టీ లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఇండియా ప్రజాబంధు పార్టీ జిల్లా అఽధ్యక్షుడు కాశి సతీష్ అన్నారు. శనివారం ఏసీ సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిరుపేదలు, కార్మిక, కర్షకుల హక్కుల సాధనకోసం కృషి చేస్తామన్నారు.
అంబేద్కర్ బాటలోనే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇం తవరకూ నెరవేర్చలేదన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన కాశి సతీష్ను పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జి రాజ్ప్రకాశ్ సన్మానించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర, సురేందర్, రవి, జయ పాల్గొన్నారు.