రైతులకు సంతృప్తికరంగా పరిహారం చెల్లిస్తాం

ABN , First Publish Date - 2022-08-19T04:49:28+05:30 IST

గడికోట నుంచి తాగునీటి పైపు లైను ఏర్పా టులో బాగంగా తంబళ్లపల్లె మం డలంలో భూమిని కోల్పోతున్న రైతులకు సంతృప్తికరమైన పరిహా రం చెల్లించేందుకు చర్యలు తీసు కుంటామని ఆర్డీవో మురళి తెలి పారు.

రైతులకు సంతృప్తికరంగా పరిహారం చెల్లిస్తాం
సమావేశంలో రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో మురళి.

తంబళ్లపల్లె, ఆగస్టు 18: గడికోట నుంచి తాగునీటి పైపు లైను ఏర్పా టులో బాగంగా తంబళ్లపల్లె మం డలంలో భూమిని కోల్పోతున్న రైతులకు సంతృప్తికరమైన పరిహా రం చెల్లించేందుకు చర్యలు తీసు కుంటామని ఆర్డీవో మురళి తెలి పారు. దీనిపై గురువారం ఆర్డీ వో ఆర్‌ఎన్‌తాండా, జుంజురపెంట, దిగువపాళ్యం, కొటాల, గంగిరెడ్డిపల్లె గ్రామాల నిర్వాసిత రైతులతో ఆయా సచివాలయాల వద్ద బహిరంగ సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులతో ముఖాముఖి చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూములు కోల్పోతున్న 93 మంది రైతులకు ఎకరాకు సుమారు రూ.6 లక్షలకు తక్కువ లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో తహసీల్దారు కళావతి, డీటీ హరి, ఆర్‌ఐ రవి నాయక్‌, మండల సర్వేయర్‌ ముబారక్‌, సర్పంచులు బాబురెడ్డి, మౌలాలి, భూదేవి చెండ్రాయుడు, చెన్నకేశవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T04:49:28+05:30 IST