జనవరి 27న విడుదల కానున్న శశికళ

ABN , First Publish Date - 2020-12-03T08:11:39+05:30 IST

జనవరి 27న విడుదల కానున్న శశికళ

జనవరి 27న విడుదల కానున్న శశికళ

బెంగళూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటూ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను శశికళ స్నేహితులు ప్రత్యేక కోర్టులో ఇటీవల డిపాజిట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తానికి సంబంధించిన అధికారిక పత్రాలు ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్టు సమాచారం. 43 నెలల జైలుశిక్షను పూర్తి చేసుకున్న శశికళకు జరిమానా చెల్లించే పక్షంలో 135 రోజుల మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయ్యే పక్షంలో వచ్చేఏడాది జనవరి 27న శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కావచ్చని జైలు అధికారులు మీడియాకు వెల్లడించారు.  

Updated Date - 2020-12-03T08:11:39+05:30 IST