కొవిడ్ తగ్గితే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ: సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2021-10-23T01:31:36+05:30 IST
కొవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వదర్శనం టోకెన్లు గత నెల కంచే పెంచామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల: కొవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వదర్శనం టోకెన్లు గత నెల కంచే పెంచామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసిన టికెట్లను గంటన్నర వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారని తెలిపారు. జియో క్లౌడ్ పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులు సైతం మొబైల్ ఫోన్ ద్వారా కూడా దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నారని చెప్పారు. కొవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో కొంతమేరకు సర్వదర్శన టోకెన్లు జారీ చేసే ఆలోచన చేస్తామన్నారు.