అభివృద్ధికి నిధులిప్పించి ఆదుకోండి
ABN , First Publish Date - 2021-01-25T05:48:10+05:30 IST
అభివృద్ధికి నిధులిప్పించి ఆదుకోండి
- భువనగిరి ఎంపీ వెంకటరెడ్డిని కోరిన సర్పంచులు
యాచారం : మండలాభివృదిఽ్ధకి ఫిబ్రవరి నెలాఖరుకల్లా రూ.2 కోట్లు నిధులు ఇప్పించి ఆదుకుంటామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మేడిపల్లి, మాల్, చింతపట్ల, నానక్నగర్, అయ్యవారిగూడ, మల్కీజ్గూడ, కొత్తపల్లి తదితర గ్రామాల సర్పంచులు ఆదివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిశారు. మండలంలోని 24 పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సర్పంచులు తెలిపారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని మండిపడ్డారు. ఫార్మాసిటీ ఏర్పాటు విషయమై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రితో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఎంపీ కోటా కింద మండలానికి అధికంగా నిధులు ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఎంపీని కలిసిన వారిలో సర్పంచులు కవిత, సరితారెడ్డి, పెద్దయ్య, సి.శ్రీనివా్సరెడ్డి, గంగాబాయి, ఎండీ హబీబొద్దీన్, రమేష్, కె.శ్రీనివా్సరెడ్డి, ఎం.నర్సింహా, కె.గురునాథ్రెడ్డి, ఎం.వెంకట్రెడ్డి, శ్రీనివా్సరెడ్డి తదితరులున్నారు.