సర్పంచలు పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాలి: జడ్పీ సీఈఓ
ABN , First Publish Date - 2021-07-25T06:34:55+05:30 IST
పాలనా శిక్షణ పొందిన సర్పంచలు అవగాహనతో పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాల ని జడ్పీ సీఈఓ భాస్కర్రెడ్డి సూచించారు.
అనంతపురం రైల్వే, జూలై 24: పాలనా శిక్షణ పొందిన సర్పంచలు అవగాహనతో పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాల ని జడ్పీ సీఈఓ భాస్కర్రెడ్డి సూచించారు. రాప్తాడు మండలంలోని మోడల్ స్కూల్లో మూడు రోజులుగా సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన సీఈఓ శిక్షణలో సర్పంచులు నేర్చుకు న్న అంశాలపై ఆరా తీశారు. అనంతరం శిక్షణ పొందిన సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఈజీఎస్ డైరెక్ట ర్ చిన్నతాతయ్య, డ్వామా పీడీ వేణుగోపాల్రెడ్డి, ఈజీఎస్ ఏపీడీ విజయప్రసాద్, ఏపీడీలు నీలిమ, లావణ్య, అయేషా, విజయ్కుమార్, ఎంపీడీఓ సొలమాన, ట్రైనర్లు లక్ష్మినరసయ్య, మాధవి, కమలాబాయి, దామోదరమ్మ, గోవిందరాజు, హర్షవర్ధన, పంచాయతీ సెక్రటరీలు ప్రేమ్కుమార్, చరణ్ పాల్గొన్నారు.