టీడీపీ ఖాతాలో ఒక సర్పంచ్, ఒక వార్డు
ABN , First Publish Date - 2021-11-15T01:19:31+05:30 IST
జిల్లాలో మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఒక సర్పంచ్, ఒక వార్డు స్థానంలో విజయం సాధించారు.
కర్నూలు: జిల్లాలో మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఒక సర్పంచ్, ఒక వార్డు స్థానంలో విజయం సాధించారు. మొత్తం మూడు సర్పంచ్, రెండు వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు వెలువడ్డాయి. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నంద్యాల మండలం భీమవరం గ్రామ పంచాయతీ 4వ వార్డులో టీడీపీ బలపరిచిన సలిపెల జనార్దన్రెడ్డి 12 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సి.బెళగళ్ మండలం ఇనగండ్ల పంచాయతీ సర్పంచ్ స్థానం నుంచి వైసీపీ బలపరిచిన అభ్యర్థి సందెపోగు ఇమ్మానుయేలు 39 ఓట్లతో గెలిచారు. ఎమ్మిగనూరు మండలం కె తిమ్మాపురంలో సీపీఐ బలపరిచిన అభ్యర్థి బీజీ మహేశ్వరమ్మ 38 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. శిరివెళ్ల మండలం శిరివెళ్ల గ్రామ పంచాయతీ 18వ వార్డులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి బిక్కబోయిన పెద్దిరాజు 258 ఓట్ల మెజారిటీతో గెలిచారు.