అనారోగ్యంతో నందిపేట సర్పంచ్‌ మృతి

ABN , First Publish Date - 2022-08-11T05:11:50+05:30 IST

మండలంలోని నందిపేట గ్రామ సర్పంచ్‌, సర్పంచ్‌ల సంఘం మం డల అధ్యక్షుడు సూదిరెడ్డి శేఖర్‌రెడ్డి (56) అనారో గ్యంతో మంగళవారం రా త్రి మృతి చెందాడు.

అనారోగ్యంతో నందిపేట సర్పంచ్‌ మృతి
పాడె మోస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- పాడె మోసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి 

మూసాపేట, ఆగస్టు 10 : మండలంలోని నందిపేట గ్రామ సర్పంచ్‌, సర్పంచ్‌ల సంఘం మం డల అధ్యక్షుడు సూదిరెడ్డి శేఖర్‌రెడ్డి (56) అనారో గ్యంతో మంగళవారం రా త్రి మృతి చెందాడు. శేఖ ర్‌రెడ్డి మృతితో మండల సర్పంచ్‌లు ప్రగాడ సానుభూతి తెలిపారు. సర్పంచ్‌ శేఖర్‌రెడ్డికి భార్య, కుమారుడు, కూతు రు ఉన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం నందిపేటకు చేరుకొని సర్పంచ్‌ మృతదేహంపై పూల మాలలు ఉంచి తన ప్రగాఢ సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. అంత్యక్రియల్లో  ఎమ్మెల్యే పాల్గొని పాడే మోశారు. అంతకు ముందు సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌, మూసాపేట జడ్పీటీసీ సభ్యుడు ఇంద్రయ్యసాగర్‌, అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డి, అడ్డాకుల ఉమ్మడి మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామన్‌గౌడ్‌, వివిధ పార్టీల నాయకులు, సర్పంచ్‌లు మృతదేహంపై పూల మాలలు ఉంచి సంతాపం తెలిపారు.

Updated Date - 2022-08-11T05:11:50+05:30 IST