USలో అత్యధిక లొకేషన్స్‌లో Sarkaruvaari paata విడుదల.. మహేశ్ కెరీర్‌లోనే ఇదే తొలిసారి

ABN , First Publish Date - 2022-05-05T00:12:42+05:30 IST

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’.

USలో అత్యధిక లొకేషన్స్‌లో Sarkaruvaari paata విడుదల.. మహేశ్ కెరీర్‌లోనే ఇదే తొలిసారి

ఓవర్సీస్ సినిమా: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ స్కామ్ వంటి డిఫరెంట్ కథాంశంతో మూవీ తెరకెక్కింది. తొలిసారి ప్రిన్స్ పక్కన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న Sarkaruvaari paata మూవీ ట్రైలర్, టీజర్, సింగిల్స్ ఇప్పటికే విడుదలై సినీ అభిమానుల నుంచి మంచి స్పందన రాబట్టాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్, ‘గీత గోవిందం’ సూపర్ హిట్ తర్వాత పరశురామ్ చేస్తున్న చిత్రం కావడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. సర్కారువారి పాట ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. 


అటు ఓవర్సీస్‌లోనూ గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మూవీ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ చిత్రం సుమారు 603 పైచిలుకు లొకేషన్స్‌లో విడుదల అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే, యూఎస్‌లో ఇంత భారీగా విడుదలవడం మహేశ్ కెరీర్‌లోనే ఇదే తొలిసారి. ఈ మూవీని అక్కడ ఫ్లైహై సినిమాస్, శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్, క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. సినిమా విడుదలకు ఒకరోజు ముందుగానే మే 11 నుంచే అమెరికాలో ప్రీమియర్స్ పడనున్నాయి. 



Read more