బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న
ABN , First Publish Date - 2022-08-17T04:41:06+05:30 IST
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కొనియాడారు. లచ్చన్న జయంతి సందర్భంగా డేఅండ్నైట్ జంక్షన్లో ఆయన విగ్రహానికి ఎంపీతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
ఎంపీ రామ్మోహన్నాయుడు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 16: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కొనియాడారు. లచ్చన్న జయంతి సందర్భంగా డేఅండ్నైట్ జంక్షన్లో ఆయన విగ్రహానికి ఎంపీతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ అజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులను గౌరవించుకుందామన్న ఆలోచన చేయకపోవడం అన్యాయమన్నారు. గౌతు లచ్చన్న ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదన్నారు. విపరక్ష నేతగా సమస్యల పరిష్కారానికి ముందుండేవారని గుర్తుచేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ లచ్చన్న జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, పార్టీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.