జుబిలెంట్తో సప్తగిరి లాబ్స్ ఒప్పందం
ABN , First Publish Date - 2020-09-15T05:50:43+05:30 IST
జుబిలెంట్ లైఫ్సైన్సెస్ కోసం హైదరాబాద్కు చెందిన సప్తగిరి లేబొరేటరీస్ రెమ్డెసివిర్ ఔషధ ఇంటర్మీడియెట్లు,
హైదరాబాద్ (ఆంధ్రజోతి బిజినెస్): జుబిలెంట్ లైఫ్సైన్సెస్ కోసం హైదరాబాద్కు చెందిన సప్తగిరి లేబొరేటరీస్ రెమ్డెసివిర్ ఔషధ ఇంటర్మీడియెట్లు, ఏపీఐలను తయారు చేయనుంది. రూ.900 కోట్ల సప్తగిరి గ్రూప్నకు చెందిన సప్తగిరి లేబొరేటరీస్ ఏపీఐలు, ఇంటర్మీడియేట్ల అభివృద్ధి, తయారీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెమ్డెసివిర్ ఔషధం ఇంటర్మీడియెట్లు, ఏపీఐల తయారీకి జుబిలెంట్ లైఫ్ గ్రూప్నకు చెందిన జుబిలెంట్ జనరిక్స్తో ఒప్పం దం కుదుర్చుకున్నట్లు సప్తగిరి ల్యాబ్స్ ప్రమోటర్, ఎండీ శిల్పా రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ ధ్రువీకరణ పొందిన యూనిట్లో రెమ్డెసివిర్ ఏపీఐలు, ఇంటర్మీడియెట్లను సప్తగిరి తయారు చేయనుంది. రూ.75 కోట్లతో ఈ యూనిట్ను సప్తగిరి సొం తం చేసుకుంది. ఫార్మాస్యూటికల్ రంగంలోకి ప్రవేశించే వ్యూహంలో భాగంగా 2019లో సప్తగిరి ల్యాబ్స్ను సప్తగిరి గ్రూప్ సొంతం చేసుకుందని గ్రూప్ చైర్మన్ మహేశ్ రెడ్డి తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని స్పెషాలిటీ కెమికల్ ప్లాంట్పై రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టింది.