ఉపాధ్యాయినులకు సన్మానం

ABN , First Publish Date - 2021-03-08T05:28:32+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేటలో మూడు మండలాలకు చెందిన ఉపాధ్యాయునులకు ఆదివారం యూటీఎఫ్‌ ప్రాంతీయ మహిళా కమిటీ సన్మానించింది

ఉపాధ్యాయినులకు సన్మానం
ఉపాధ్యాయినులను సన్మానిస్తున్న యూటీఎఫ్‌ ప్రాంతీయ మహిళా కమిటీ

సూళ్లూరుపేట, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేటలో మూడు మండలాలకు చెందిన ఉపాధ్యాయునులకు ఆదివారం యూటీఎఫ్‌ ప్రాంతీయ మహిళా కమిటీ సన్మానించింది. స్థానిక బాలికోన్నత పాఠశాలలో యూటీఎఫ్‌ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలు నిర్వహించారు. నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ లెక్చరర్‌ హరితాదేవి మహిళా సాధికారతపై ఉపన్యసించారు. తడ,  సూళ్లూరుపేట,  దొరవారిసత్రం మండలాలకు చెందిన తాళ్ల కరుణశ్రీ, మద్దిపాటి లక్ష్మీకుమారి, నిడిగంటి వెంకటలక్ష్మి, రావిశెట్టి శైలజ, కలవకుంట వసంత, తాడిబోయిన తారకేశ్వరిలను సన్మానించారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీజే రాజశేఖర్‌ పాల్గొన్నారు. సూళ్లూరుపేట యూటీఎఫ్‌ ప్రాంతీయ మహిళా కన్వీనర్‌ ఎన్‌. జానకి, కె. అరుణకుమారి,  కేఎంఎస్‌ సునీల, ఉషారాణి,  రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యూటీఎఫ్‌కు చెందిన ప్రభాకర్‌, జనవిజ్ఞానవేదిక రామమూర్తి, బాబు, నవీన్‌కుమార్‌, తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2021-03-08T05:28:32+05:30 IST