సంక్రాంతి సెలవులతో పల్లెబాట పట్టిన ప్రజలు
ABN , First Publish Date - 2022-01-09T18:34:36+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. భాగ్యనగర ప్రజలు పల్లెబాట పడుతున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. భాగ్యనగర ప్రజలు పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లెందుకు పయనమవుతున్నారు. కరోనా నేపథ్యంలో మళ్లీ పలు సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో పాటు విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించడంతో వాహనాల రద్దీ మరింత అధికమైంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బస్టాండ్లన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. హైదరాబాద్, విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.