మందకొడిగా బండి సంజయ్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-05-02T21:01:48+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్‌ పాదయాత్ర మందకొడిగా సాగుతోంది. ఎండ తీవ్రతతో రెండు నియోజకవర్గాలను బీజేపీ నేతలు స్కిప్ చేశారు.

మందకొడిగా బండి సంజయ్‌ పాదయాత్ర

హైదరాబాద్: బీజేపీ నేత బండి సంజయ్‌ పాదయాత్ర మందకొడిగా సాగుతోంది. ఎండ తీవ్రతతో రెండు నియోజకవర్గాలను బీజేపీ నేతలు స్కిప్ చేశారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలను కమలనాథుడు తప్పించారు. రోజుకు 10 కిలోమీటర్లు కూడా పాదయాత్ర జరగకపోవడంతో రూట్‌లో మార్పులు చేర్పులు చేశారు. 5న మహబూబ్‌నగర్‌లో పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా రానున్నారు. 14న మహేశ్వరంలో ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 14న మహేశ్వరం చేరుకునేలా పాదయాత్రలో మార్పులు చేశారు.

Updated Date - 2022-05-02T21:01:48+05:30 IST