కేసీఆర్‌పై మండిపడ్డ బండి సంజయ్

ABN , First Publish Date - 2022-02-19T00:59:20+05:30 IST

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలను సంజయ్ దర్శించుకున్నారు.

కేసీఆర్‌పై మండిపడ్డ బండి సంజయ్

ములుగు: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలను సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మేడారం జాతరకు రాకుండా.. గిరిజన జాతిని, తెలంగాణ సంస్కృతిని అవమానించారని ధ్వజమెత్తారు. పేదలు, గిరిజనులు ఆరాధించే జాతరకు ఎందకు రాలేదని ప్రశ్నించారు. జాతరకు వస్తే ప్రశ్నిస్తారనే భయంతోనే కేసీఆర్ రాలేదన్నారు. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో కేసీఆర్ అహంకారాన్ని అణచివేస్తామని సంజయ్ హెచ్చరించారు.

Updated Date - 2022-02-19T00:59:20+05:30 IST