శానిటైజర్ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
ABN , First Publish Date - 2020-08-06T06:37:44+05:30 IST
మత్తు కోసం శానిటైజర్ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దంటూ డీఎస్పీ సుధాకర్ లోసారి సూచించారు
ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 5 : మత్తు కోసం శానిటైజర్ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దంటూ డీఎస్పీ సుధాకర్ లోసారి సూచించారు. శానిటైజర్ విక్రయాలపై మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో బుధవారం డీఎస్పీ నేతృత్వంలో వన్టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఈబీ సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ అలీబేగ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాముడు తనిఖీలు చేశారు. అంతకు ముందు మద్యం దుకాణాల ముందు బారులుదీరిన మందుబాబులకు డీఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐలు నాగరాజు, సీతారామిరెడ్డి, ఎస్ఐ అలీబేగ్, డీఐ జయరాముడు పాల్గొన్నారు.