పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలి

ABN , First Publish Date - 2022-01-25T06:23:13+05:30 IST

ముఖ్యమంత్రి హామీ మేరకు పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ.పెంచలయ్య పేర్కొన్పారు.

పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలి

కావలి, జనవరి 24: ముఖ్యమంత్రి హామీ మేరకు పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ.పెంచలయ్య పేర్కొన్పారు. సోమవారం  4వ డివిజన్‌లోని మస్టర్‌ పాయింట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌.ఆనందరావు, కార్యదర్శిటీ. మాలకొండయ్య, సీఐటీయూ నాయకులు రవి, పోలయ్య, నవాజ్‌, ఒంగోలు రమేష్‌, పెద అంకయ్య, శీనయ్య, చిన్నమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T06:23:13+05:30 IST