ప్రీక్వార్టర్స్లో సానియా జోడీ
ABN , First Publish Date - 2020-02-19T10:42:46+05:30 IST
పునరాగమనంలో జోరుమీదున్న భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా దుబాయ్ ఓపెన్లో శుభారంభం చేసింది.
దుబాయ్: పునరాగమనంలో జోరుమీదున్న భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా దుబాయ్ ఓపెన్లో శుభారంభం చేసింది. ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియాతో కలిసి సానియా డబుల్స్లో ప్రీక్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పోరులో సానియా-గార్సియా ద్వయం 6-4, 4-6, 10-8తో అల్లా కుద్రెత్సోవా (రష్యా)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లోవేనియా) జోడీని ఓడించింది. క్వార్టర్ఫైనల్లో చోటుకోసం ఐదోసీడ్ సాయ్సై జెంగ్ (చైనా)-బార్బరా రెసికోవా (చెక్ రిపబ్లిక్) జంటతో సానియా జోడీ అమీతుమీ తేల్చుకోనుంది.