రిటైర్‌‌మెంట్ ప్రకటించిన సానియా మీర్జా

ABN , First Publish Date - 2022-01-19T21:51:45+05:30 IST

మెల్‌బోర్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది సీజన్‌తో తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించారు.

రిటైర్‌‌మెంట్ ప్రకటించిన సానియా మీర్జా

మెల్‌బోర్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది సీజన్‌తో తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల డబుల్స్ తొలి రౌండ్ గేమ్‌లో ఓడిపోగానే ఆమె తన రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేశారు. తన వయసు పెరుగుతోందని, ప్రస్తుతం తనకు శరీరం పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్నారు. తనకు మూడేళ్ల కుమారుడున్నాడని టూర్ల పేరుతో బాబు జీవితాన్ని రిస్క్‌లో పెట్టలేనని చెప్పారు. 2003 నుంచి టెన్నిస్ ఆడుతోన్న సానియా ఇప్పటివరకూ ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచారు. సింగిల్స్‌లో సానియా బెస్ట్ ర్యాంక్ 27 కాగా డబుల్స్‌లో 2007లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు. హైదరాబాద్‌కు చెందిన సానియా మిర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లి చేసుకున్నారు.  

Updated Date - 2022-01-19T21:51:45+05:30 IST