సెమీస్లో సానియా జోడీ
ABN , First Publish Date - 2021-03-04T09:39:39+05:30 IST
ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత ఏస్ క్రీడాకారిణి సానియా మీర్జా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా-ఆండ్రేజా క్లెపాక్ (స్లొవేనియా) జోడీ 6-2, 6-0తో నాలుగో సీడ్...
దోహా: ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత ఏస్ క్రీడాకారిణి సానియా మీర్జా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా-ఆండ్రేజా క్లెపాక్ (స్లొవేనియా) జోడీ 6-2, 6-0తో నాలుగో సీడ్ అన్నా బ్లింకోవా (రష్యా)-గాబ్రియేలా డబ్రోస్కీ (కెనడా) ద్వయంపై గెలుపొందింది. సెమీ్సలో టాప్ సీడ్ బార్బరా క్రెజికోవా-క్యాటరీనా సినియాకోవా (చెక్రిపబ్లిక్) ద్వయంతో తలపడనుంది.